రెండు నెలల్లో 200 శాతం పెరిగిన సైబర్ దాడులు 

గడిచిన రెండు నెలల్లో 200 శాతం సైబర్‌‌ దాడులు ‌ పెరిగాయని పీఎంవో అధికారి గుల్షన్‌ రాయ్‌ చెప్పారు. అయితే చైనా – భారత్ ల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవి పెరిగాయనే దానికి సాక్ష్యాలు లేవని ఆయన అస్పష్టం చేశారు. 
 
“పిషింగ్‌, రాన్సమ్‌వేర్‌‌ ఎక్కువయ్యాయి. జనవరి, ఫిబ్రవరి చివర  నుంచి ఈ కేసులు ఎక్కువయ్యాయి. ఉద్రిక్త ‌ పరిస్థితులు దృష్ట్యా పెరగలేదు” అని ఆయన చెప్పారు. ఆఫీసులు అన్నీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, పర్సనల్‌ కంప్యూటర్స్‌లో కూడా అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకటికి రెండు సార్లు అప్లికేషన్‌ వెరిఫికేషన్‌ చేసుకోవాలని సూచించారు. 
 
రెండు నెలలుగా హ్యాకింగ్‌ బాగా పెరిగిందిని చెబుతూ  దాదాపు అది 200 శాతం కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై మానిటరింగ్‌ చేస్తున్నామనితెలుపుతూ  బ్యాంక్‌లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పూర్తిగా ఆత్మనిర్భాన్‌ భారత్‌లోకి మారాలంటే మరో రెండేళ్లు కచ్చితంగా పడుతుందని ఆయన చెప్పారు.