టీవీ-9 మాజీ సీఈవో రవి ప్రకాశ్పై ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. గతంలో బంజారాహిల్స్ పోలీసులు పెట్టిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు తాజా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసులో రవిప్రకాశ్ను విచారించేందుకు త్వరలోనే సమన్లు జారీ చేసేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఎలాంటి అనుమతి లేకుండా రూ.18 కోట్లు విత్డ్రా చేశారంటూ అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్పై నిరుడు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం గత అక్టోబరులో ఆయన్ని అరెస్ట్ చేశారు.
రవిప్రకాశ్పై మోపిన అభియోగాలు, దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు.

More Stories
వరంగల్లో కాకతీయుల కాలం నాటి శివాలయం కూల్చివేత
జూబ్లీహిల్స్లో విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య
ప్రధాని మోదీ పర్యటనలో కానుకగా రూ 8 వేల కోట్ల ప్రాజెక్టులు