
ప్రపంమంతా అస్వస్థతతో కష్టకాలంలో ఉన్న సమయంలో భగవద్గీత చదివితే శాంతి, ధైర్యం కలుగుతుందని అమెరికాలోని మొదటి హిందూ లా మేకర్ తులసీ గబ్బార్డ్ తెలిపారు. హవ్వాయి నుంచి ఒక వర్చువల్ కమెన్స్మెంట్లో మాట్లాడిన తులసీ రేపు ఏం అవుతుందో ఎవరికి తెలియదని, అందుకే ఇలాంటి సమయంలో అందరూ భగవద్గీత చదవాలని సూచించారు.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన భక్తి యోగా, కర్మ యోగా ద్వారా మనకు ధైర్యం, శాంతి రెండు కలుగుతాయని క్లాస్ ఆఫ్ 2020 ఫర్ హిందూ స్టూడెంట్స్తో ఆమె చెప్పారు.
“ జీవితంలో కొత్త అధ్యాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు జీవితం ఉద్దేశం ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కర్మ యోగాను అభ్యస్తిస్తున్న మీరు దేవుడికి సేవ చేయడమే మీ ఉద్దేశం అని గుర్తించ గలిగితే విజయవంతమైనట్లు” అని ఆమె పేర్కొన్నారు.
విజయం కేవలం భౌతిక విషయాలు, మెరిసే వస్తువుల ద్వారా నిర్వచించలేమని, అది సేవ చుట్టూ కేంద్రీకృతమైన విజయవంతమైన, సంతోషకరమైన జీవితం అని తులసీ ఆమె సూచించారు. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని హిందూ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కమెన్స్మెంట్నులో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
ఔట్ సోర్సింగ్ నియామకాలతోనే పేపర్ లీకేజి!