అలాగే పాతబస్తీ సల్కం చెరువు భూమిలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కట్టిన కాలేజీలో వేల మంది పిల్లలు చదువుతున్నందున వారి జీవితాలను నాశనం చేయలేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్కు ఒక న్యాయం, అట్టడుగు పేదలకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాలే ముఖ్యమా ?అని నిలదీశారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదల జీవితాలు పట్టవా? అని మండిపడ్డారు. కష్టపడి చెమటోడ్చి ఇండ్లు కట్టుకున్న మధ్య తరగతి ప్రజలు బతుకులు లెక్కలేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని కూల్చివేస్తారా? లేదా? లేకపోతే ప్రజల పక్షాన ఆ పని తామే చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రామచందర్ రావు అల్టిమేటం జారీ చేశారు.
కాగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను తమ పార్టీ ఒక సవాలుగా తీసుకుంటోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చెప్పారు. బలమైన ప్రతిపక్షం బరిలో ఉంటే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. రానున్న 25 రోజుల్లోనే బీజేపీ పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని రామచందర్రావు వెల్లడించారు.
పార్టీలోని ముఖ్య నేతలతో చర్చించి, అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలో ఎటువంటి వర్గాలు లేవని, అందరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఐక్యంగా పనిచేస్తారని ఆయన వివరించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ పెద్దగా దృష్టి సారించలేదని, అయితే ఈసారి వాటిపైనా ప్రత్యేకంగా దృష్టి పెడతామని పేర్కొన్నారు.

More Stories
హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవిపై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
11వ శతాబ్దం నాటి చోళుల రాగి పలకలు భారత్ కు అప్పగింత
హైకోర్టు తీర్పుతో భోజ్శాల సముదాయంలో విశేషంగా పూజలు!