అక్టోబర్ నెలలో భారీగా జీఎస్టీ వసూళయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత రూ.లక్ష కోట్ల మార్క్ను దాటిందని చెప్పింది. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ నుంచి పన్నుల వసూళ్లు తగ్గిపోయాయి. ఈ నెల చివరి నాటికి జీఎస్టీఆర్-3 రిటర్న్లు 80లక్షలు దాఖలు కాగా.. రూ.1.05లక్షల కోట్లు వసూలయ్యాయి.
అక్టోబర్ నెలలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ .1,05,155 కోట్లు, ఇందులో సీజీఎస్టీ రూ .19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ .23,375 కోట్లతో సహా), సెస్ రూ.8,011 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.932 కోట్లతో సహా) అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
గతేడాది గత ఏడాది ఇదే నెలలో రూ.95,379 కోట్లు వసూళయ్యాయి. దీంతో గతేడాది కంటే 10 శాతం జీఎస్టీ వసూలులో వృద్ధి కనిపించిందని చెప్పింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు వ్యాపారాలు నిలిచిపోవడంతో జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది.
More Stories
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఎయిరిండియాలో ఇక ఉచిత లగేజి 15 కిలోలు మాత్రమే
బంగారం స్మగుల్డ్ చేస్తూ చిక్కిన అఫ్ఘన్ దౌత్యవేత్త