దుబ్బాక ఉప ఎన్నికలో కమలం-కారు మధ్య నోట్ల కట్లల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఇరుపార్టీలు ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం హీటెక్కించాయి.
మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని సీఈసీ నియమించింది.
నోట్ల కట్టల కలకలంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ సరోజ్ కుమార్ను నియమించింది. మొత్తం వ్యవహారాన్ని స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు.

More Stories
ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ డ్రామాలు
జిహెచ్ఎంసిలో విలీనంతో గ్రామస్థుల జీవనం అస్తవ్యస్తం
ఆత్మీయ భరితంగా సప్త శక్తి సంగం