ట్రంప్‌ విధానాలపై ఫెడ్‌ చైర్మన్‌ ఆగ్రహం

ట్రంప్‌ విధానాలపై ఫెడ్‌ చైర్మన్‌ ఆగ్రహం
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. భారత్‌, చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా 70కిపైగా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ట్రంప్‌ నిర్ణయంతో అమెరికా కంపెనీలు, పరిశ్రమలపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ట్రంప్‌ ఆర్థిక విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. 
ఈ విషయంలో ఇప్పటికే అమెరికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన కాలిఫోర్నియా ట్రంప్‌ యంత్రాంగంపై న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే.
తాజాగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ చైర్మన్‌ జోరోమ్‌ పావెల్‌ సైతం ట్రంప్‌ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ యంత్రాంగం ఇప్పటి వరకూ ప్రకటించిన సుంకాలు ఊహించిన దానికంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు.  వీటి గురించి ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదని తెలిపారు. ట్రంప్‌ టారిఫ్‌ విధానాలతో అమెరికాలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వు సిస్టమ్ (అమెరికా కేంద్ర బ్యాంకు)ను ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. టారిఫ్‌ల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టారిఫ్‌ల వల్ల నెలకొన్న అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు శాశ్వత నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలపై భారీ స్థాయిలో సుంకాలతో ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. దీనివల్ల యుఎస్‌లోని కంపెనీలు, పరిశ్రమలపైనా పెను ప్రభావం పడనుండటంతో ట్రంప్‌ ఆర్థిక విధానాలపై స్వదేశంలోనూ పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఈ నేపథ్యంలో పావెల్‌ వ్యాఖ్యలకు మరింత విశేషం నెలకొంది. టారిఫ్‌లను ఇలా పెంచుకుంటూ పోతే ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.