
తిరుమలలో 100 శాతం ప్రక్షాళన జరగాలని, ఏ స్థాయిలోనూ దీనికి మినహాయింపు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు.
తిరుమల సేవలు, కల్పించే సౌకర్యాల్లో పూర్తిగా మార్పు కనిపించాలని తేల్చి చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల్లో తీసుకున్న చర్యలను టీటీడీ అధికారులు సీఎం ఎదుట ప్రజంటేషన్ ఇచ్చారు.
రోజురోజుకూ తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అక్కడ చేపట్టాల్సిన చర్యలపై సీఎం టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీవారి దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు.
రోజురోజుకూ తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అక్కడ చేపట్టాల్సిన చర్యలపై సీఎం టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీవారి దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక రోజులతోపాటు సాధారణ రోజుల్లో శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి లడ్డు, అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదికను అందించారు.
తిరుమలలో భక్తులకు కల్పించే సేవలు బాగా ఉంటేనే తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. అభివృద్ధి పనుల పేరుతో శ్రీవారి డబ్బులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టొద్దని పేర్కొన్నారు. టీటీడీలో ధర్మకర్తలు కేవలం నిమిత్త మాత్రులే అని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని, సేవలను తీర్చిదిద్దాలని హితవు పలికారు.
అనుభవం పేరుతో అవసరం లేకపోయినా పాత వారిని పదవుల్లో ఇంకా కొనసాగించవద్దని చంద్రబాబు టీటీడీ అధికారులకు సూచించారు. త్వరలోనే జేఈవో, సీవీఎస్వో, ఎస్వీబీసీ ఛైర్మన్, బర్డ్ డైరెక్టర్ల నియామకం చేపట్టాలని ఆదేశించారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని.. 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. భక్తులకు టీటీడీ అందించే సేవలపైన ఫీడ్బ్యాక్ తీసుకోవాలని.. త్వరలోనే వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వెల్లడించారు.
అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధికి ప్రణాళిక, అమరావతిలో శ్రీవారి ఆలయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా వాటన్నింటికి సంబంధించిన నమూనాలను సీఎం పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాల పురోగతిపైనా టీటీడీ అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు