బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రసక్తే లేదు

బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రసక్తే లేదు
దేశంలో ఎవరిపైనా బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో విదేశీ భాషపై అధికంగా ఆధారపడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఫలితంగా విద్యార్థులకు తమ మూలాలుపై అవగాహన తగ్గుతోందని చెప్పారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జాతీయ విద్యావిధానంలో ప్రయత్నం జరిగిందని వివరించారు.
 
తమకు నచ్చిన భాషను ఎంచుకునే స్వేచ్ఛకు జాతీయ విద్యావిధానం ఎప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు  రాజకీయ కారణాలతో జాతీయ విద్యావిధానాన్ని తమిళినాడులోని అధికార డీఎమ్‌కే పార్టీ వ్యతిరేకించడాన్ని ఆయన ఆ లేఖలో తప్పుబట్టారు. ఈ విధానంపై ప్రభుత్వం హస్త్రదృష్ఠితో వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. 
 
 రాజకీయ లక్ష్యాల కోసం పురోగామి విధానాలను ప్రమాదాలుగా చూపించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ భాష అజరామరమైనదని చెన్నైలో ప్రధాని అన్న మాటలను కూడా ఆయన గుర్తు చేశారు. తమిళ భాష, సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యవిధానంతో రాజకీయం వద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.అంతుకుమునుపు, తమిళనాడు సీఎం ప్రధాని రాసిన లేక ప్రకంపనలు సృష్టించింది. మూడు భాషల బోధనతో ఉన్న జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోతే కేంద్రం నిధులు వదులుకోవాల్సి వస్తుందంటూ ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరిక చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కేంద్రం రూ.2,154 కోట్ల నిధులను విడుదల చేయాలని ఆయన కోరారు. అయితే, ఈ లేఖపై కేంద్ర మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళాడు సీఎంకు ప్రత్యుత్తరమిచ్చారు.

మన భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుతూ,  పెంపొందించుకుంటూ భారతదేశ విద్యా వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు పెంచడం కోసం నూతన విద్యావిధానం రూపొందించిన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి వారి మాతృభాషలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ఈ విధానం నిర్ధారిస్తుందని తెలిపారు. ఏ రాష్ట్రం లేదా సమాజంపైనా ఏ భాషను రుద్దే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. 
 
దశాబ్దాలుగా అధికారిక విద్యలో క్రమంగా పక్కన పెట్టబడిన తమిళం సహా భారతీయ భాషల బోధనను పునరుద్ధరించడం, బలోపేతం చేయడం ఈ విధానం  ప్రధాన లక్ష్యాలలో ఒకటని కేంద్ర మంత్రి తెలిపారు.