
దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. అక్కడ ప్రకృతి అందాలతో పాటు ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశ నలుమూలల నుంచి ప్రజలు నిత్యం తమిళనాడుకు పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను, మౌలిక వసతులను కల్పిస్తోంది.
ఇందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్ బ్రిడ్జ్ ను నిర్మించింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం ప్రారంభించారు. కన్యాకుమారి తీరంలో వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి 1వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం రెండు రోజులపాటు సిల్వర్జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఈ గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది 77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన.. 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ వ్యయం.. రూ.37 కోట్లు. దీనికి గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా ఇటీవలె పూర్తయింది. రేపటి నుంచి సిల్వర్జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఈ గాజు వంతెనను సీఎం ప్రారంభించారు. ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్