
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్కు, రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ విలువలను ఉల్లంఘించారని ఆరోపించారు.
పార్లమెంట్లో అంబేద్కర్ గురించి తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించదని ఆరోపిస్తూ ఆయనను ఎప్పటికీ, కనీసం కలలోనూ అవమానించనలేని పార్టీ నుంచి తాను వచ్చినట్లు స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈమేరకు స్పష్టత ఇచ్చారు.
‘కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేక పార్టీ. ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. కేంద్రంలో బీజేపీ మద్దతు ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరణానంతరం ఆయనకు భారతరత్న ఇచ్చింది. కాంగ్రెస్ ఏనాడూ అంబేడ్కర్ స్మారకాన్ని నిర్మించలేదు. బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ను ఎంతో గౌరవించింది. ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టంగా ఉన్న నా ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో ఉంది’ అని అమిత్ షా వివరణ ఇచ్చారు.
“కలలో కూడా అంబేడ్కర్ ఆలోచలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి వచ్చా. ఎమర్జెన్నీ విధించడం ద్వారా రాజ్యాంగ విలువలను ఉల్లంఘించింది. ఆ వాస్తవాలన్నీ బయటకు రాగానే కాంగ్రెస్ తన పాత ట్రిక్కులను ఉపయోగించి వాస్తవాలను వక్రీకరిస్తుంది” అని అమిత్ షా మండిపడ్డారు.
అంతకు ముందు ముందు మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేడ్కర్పై ప్రధాని మోదీకి గౌరవముంటే తక్షణం అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షాను సమర్థిస్తూ మోదీ ట్వీట్లు చేయడాన్ని ఖర్గే తప్పుబట్టారు. అమిత్ షా ఏం చెప్పారో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశం మొత్తం చూసిందని గుర్తు చేశారు.
అంతకు ముందు ముందు మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేడ్కర్పై ప్రధాని మోదీకి గౌరవముంటే తక్షణం అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షాను సమర్థిస్తూ మోదీ ట్వీట్లు చేయడాన్ని ఖర్గే తప్పుబట్టారు. అమిత్ షా ఏం చెప్పారో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశం మొత్తం చూసిందని గుర్తు చేశారు.
ఆయన మాటలు కేవలం మనుస్మృతిలో మాత్రమే ఉంటాయని విమర్శించారు. అలాంటి వాటిని అంబేడ్కర్ ఎప్పుడూ సమర్థించలేదని స్పష్టం చేశారు. ‘ఇలాంటి సిద్ధాంతాన్ని అంబేడ్కర్ చెప్పలేదు. స్వర్గం, నరకం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి మాటలను హోంమంత్రి మాట్లాడితే మోదీ ఆయన్ను సమర్థించేందుకు ఆరు ట్వీట్లు చేశారు. అంత అవసరమేంటి?’ అని ప్రశ్నించారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?