
వాయువ్య పాకిస్థాన్ లోని కల్లోలిత ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో గత 24 గంటల్లో మతోన్మాద వర్గీయుల దాడికి 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సరిహద్దులోని కుర్రం జిల్లాలో అలిజాయి, బగన్ గిరిజన తెగల మధ్య దాడులు జరిగాయి. ఉన్నతాధికారులు, పోలీస్లు హెలికాప్టర్పై ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
వాహనాల కాన్వాయ్పై దాడి అనంతరం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని కుర్రం జిల్లా అలీజాయ్, బగన్ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 47 మంది వరకు హత్యకు గురయ్యారు. మరో వైపు బలిషెల్, ఖార్ కాలీ, కుంజ్ అలీజాయ్, మక్బాల్లో సైతం కాల్పులు కొనసాగుతున్నాయి. భారీ ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.
ఘర్షణల్లో ఇండ్లతో పాటు దుకాణాలు సైతం ధ్వంసమయ్యాయి. ఘర్షణల నేపథ్యంలో పలువురు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శనివారం విద్యాసంస్థలను మూసి ఉంచినట్లు ప్రైవేట్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ చైర్మన్ ముహమ్మద్ హయత్ హసన్ తెలిపారు.
బగన్, మండూరి, ఓచాట్లో గురువారం 50 మందికిపైగా ప్రయాణికుల వాహనాలపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఆరు వాహనాలు ఢీకొట్టడంతో మహిళలు, పిల్లలు సహా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు పరాచినార్ నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. బాధితుల్లో ఎక్కువ మంది షియా వర్గానికి చెందిన వారు ఉన్నారు.
More Stories
వరద బాధిత నిధులను ఉగ్రవాదులకు మళ్లించిన పాక్
సిక్కు మహిళపై లైంగిక దాడిని ఖండించిన బ్రిటిష్ ఎంపీ
వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో భారీ ప్రదర్శన