
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. అనంతపురంలో రాష్ట్రస్థాయిలో వాల్మీకి జయంతి వేడుకలను జరపనున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేశ్ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు ఇప్పుడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ‘యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి ప్రజలు పాదయాత్ర సందర్భంగా విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ సందర్భంగా వారికి తాను హామీ ఇచ్చానని, ఆ హామీని ఇప్పుడు తమ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు.
ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించాలని తాజాగా ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు.అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా తమ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.
More Stories
భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం