తమ గత ఉత్తర్వును పాటిస్తూ ఎలక్ట్రానిక్ రీతిలో డాక్యుమెంట్లు దాఖలు చేయవలసింని పిటిషనర్ను ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలాతో కూడిన ధర్మాసనం కోరి, తదుపరి విచారణకు ఆయన పిటిషన్ను నవంబర్ 6కు పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దు చేయాలని కోరుతూ తాను సమర్పించిన లేఖపై నిర్ణయం తీసుకోవలసిందిగా కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఎ)కు ఆదేశాలు జారీ చేయాలన్న స్వామి పిటిషన్ను బెంచ్ విచారిస్తున్నది.
లోక్సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన లేఖపై స్టాటస్ నివేదికను సమర్పించవలసిందిగా ఎంహెచ్ఎను ఆదేశించాలని స్వామి తన పిటిషన్లో కోరారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్లో ఉన్న వ్యవహారానికి తన కేసుతో సంబంధం లేదని, ఆ వాదనలు పూర్తిగా భిన్నమైనవని ఆదిలో స్వామి బెంచ్కు విన్నవించారు. ‘ఓకె, మేము చూస్తాం’ అని బెంచ్ చెప్పింది.

More Stories
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్స్వీప్
అస్పృశ్యత భావన సమాజాన్ని విభజిస్తుంది
రాజ్యసభకు మూడో టీఎంసీ ఎంపీ రాజీనామా