గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో 2028 వరకు ఫోర్టిఫైడ్‌ బియ్యం

గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో 2028 వరకు ఫోర్టిఫైడ్‌ బియ్యం
ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఫోర్టిఫైడ్‌ బియ్య పంపిణీ కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. 2028 డిసెంబర్‌ వరకు ఉచితంగా ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా చేసేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహార ధాన్యాలను అందించేందుకు ఉద్దేశించిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో నాలుగేళ్ళు పొడిగిస్తున్నామని, ఇందువల్ల ప్రభుత్వానికి రూ.17,082 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపింది. ఈ మొత్తం కేంద్రమే భరిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
 
ఫోర్టిఫైడ్ రైస్ నాణ్యతను పరీక్షించేందుకు 27 ఎన్‌ఏబీఎల్ ల్యాబ్స్‌ను వినియోగిస్తామని, విటమిన్ మినరల్ ప్రీమిక్స్ టెస్టింగ్ కోసం 11 ఎన్‌ఏబీఎల్ ల్యాబ్‌లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన సప్లై చైన్ డపలప్‌‌మెంట్ కోసం రూ.11,000 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి తెలిపారు. పీఎంజీకేఏవైలో భాగంగా కేంద్రం వందశాతం నిధులతో పోషకాహారం అందించేందుకు ఫ్టోర్టిఫైడ్‌ రైస్‌ని అందించేందుకు చర్యలు చేపట్టింది.
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు కేందినెట్‌ నిర్ణయం తీసుకున్నది.  లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవ (ఇసిడిఎస్) అంతటా బలవర్థకమైన బియ్యం సరఫరా, దేశంలో రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పీఎం పోషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
 
ఏప్రిల్‌ 2022లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ మార్చి 2024 నాటికి ఇప్పటికే మూడు విడుతలుగా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.17,082కోట్లు ఖర్చు చేయనున్నది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ ఎఐ)  ప్రకారం సాధారణ బియ్యంలో పోషకాలను జోడించి ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేస్తారు. ప్రజల ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూక్ష్మపోషకాలు జోడిస్తారు. 
 
ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్‌  గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందువల్ల 22,000 ఉద్యోగాల సృష్టి జరిగుతుందని, వివిధ దశల్లో ఈ ఎన్ఎంహెచ్‌సీని అభివృద్ధి చేస్తామని చెప్పారు.  రాజస్థాన్‌, పంజాబ్‌ దేశ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది. రూ.4,406కోట్లతో 2,208 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేంద్రం చేపట్టనుంది.