
అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని, పాస్పోర్టును సంబంధిత మేజిస్ట్రేట్ ముందు స్వాధీనం చేయాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయడం కానీ, బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
జైలు నుంచి విడుదలైన తర్వాత ఎక్కడ నివాసం ఉంటున్నదీ, మొబైల్ నంబర్ వివరాలను దర్యాప్తు అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. బెయిల్ షరతులు ఉల్లంఘించినప్పుడు, అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించేందుకు పోలీసులకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు శుక్రవారం తీర్పు ఇచ్చారు.
న్యాయమూర్తి తీర్పు వెలువరించిన తర్వాత పిన్నెల్లి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఎస్హెచ్వో విచారణకు హాజరుకావాలనప్పుడు పిటిషనర్(పిన్నెల్లి) తన న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. అయితే, దీనికి ప్రత్యేకంగా పిటిషన్ వేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ఇదేసమయంలో ‘‘అసలు న్యాయవాది ఎందుకు? పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తుంటే.. న్యాయవాదులు సమాధానం చెబుతున్నట్టు పత్రికల్లో చదివాను’’ అని వ్యాఖ్యానించారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మే 13న మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఆయనను అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేశారు.
పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రశ్నించిన నాగశిరోమణి అనే మహిళను దూషించారు. ఆయా ఘటనలకు సంబంధించి పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు పిన్నెల్లి సహా ఆయన అనుచరులు మరో 15 మందిపై హత్యాయత్నం(ఐపీసీ 307) సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అదేవిధంగా మే 14న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, వారి అనుచరులు కారంపూడిలో దాడులకు పాల్పడుతుండగా అడ్డుకోబోయిన సీఐ నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచారు. సీఐ ఫిర్యాదుతో వీరిపై పోలీసులు హత్యాయత్నం, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో అరెస్ట్ అయిన రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల గురజాల కోర్టును ఆశ్రయించగా న్యాయాధికారి తిరస్కరించారు. దీంతో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు