మరోవైపు ఎంపిక చేసిన 50 కేవీకేలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలోనూ రైతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు ఆయా కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, కొత్త సాంకేతికతలు, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు.
అలాగే ‘పీఎం-కిసాన్’ లబ్ధిదారులకు తమ అకౌంట్ స్టేటస్, నిధుల జమను చూసుకోవడం, ‘కిసాన్-ఇమిత్ర చాట్బాట్’ వినియోగించే విధానం వంటివి కూడా నేర్పుతారు. ఈ కేంద్రాల పరిధిలో ‘వ్యవసాయ సఖి’ శిక్షణ పొందిన మహిళలకు కేంద్రమంత్రులు ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేస్తారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అన్నదాతకు ప్రధాని మోదీ నిరంతరం చేయూత అందిస్తున్నారని, . ఆ మేరకు 2019లో మోదీ శ్రీకారం చుట్టిన ‘పీఎం-కిసాన్’ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా నగదు జమ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా దేశంలోని 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.3.04 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూరిందని చౌహాన్ తెలిపారు.
దేశంలో నేటికీ వ్యవసాయ రంగంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలు లభిస్తుందని చెప్పారు. దేశ ఆహార నిల్వలను సమర్థంగా నిర్వహించడంలో రైతులు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాబోయే 100 రోజుల ప్రణాళిక సహా నిరంతర కృషి, వ్యూహాత్మక ప్రణాళికలు వ్యవసాయ రంగ ప్రగతిపై ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమని వివరించారు.
More Stories
భారీగా పెరగనున్న జనరల్ కోచ్లు
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ ప్రారంభించిన బజాజ్
స్టాక్ మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులపై సిజెఐ హెచ్చరిక