అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు నిన్నటితో నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది.
ఈ రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క బీజేపీ అభ్యర్ధులు మినహా ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఈసీ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని రెండు లోక్సభ, 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది.
గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, మార్చి 30 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని ఈసీ అధికారులు తెలిపారు. నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఆ ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నికైనల్టు ప్రకటించారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 197 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
30 ఏళ్ళ పాటు ఎమ్యెల్యేగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నాబం తుకి ఈ పర్యాయం లోక్ సభకు పోటీచేస్తున్నారు.
More Stories
28200 మొబైళ్లు బ్లాక్.. 20 లక్షల నంబర్లు కట్!
బీజాపుర్ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతం
కేదార్ నాథ్ ధామ్ యాత్ర నేటి నుంచే