
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణాలో గల 19 సీట్లలో బీజేపీ 12 సీట్లు గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షావెల్లడించారు. మంగళవారం నాడు సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొంటూ ఈ లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులందరూ కృషి చేయాలని స్పష్టం చేశారు.
‘ఏప్రిల్, మేలో జరిగే ఎన్నికలతో మళ్లీ అధికారంలోకి బీజేపీనే వస్తుంది. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవాలి.. ఇదే మన లక్ష్యం. దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం’ అని వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే అని షా తేల్చి చెప్పారు.
కేంద్రం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని చెబుతూ బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా.. లేకున్నా.. రాష్ట్రానికి ఉపయోగం లేదని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఓటు వేస్తే అది దుర్వినియోగమే అవుతుందని పేర్కొంటూ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని కోరారు. ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రకటనలకే పరిమితం అయ్యిందని విమర్శించారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలవాలని స్పష్టం చేశారు.దేశంలో ఎవరిని అడిగినా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారుని చెబుతూ మేనిఫెస్టోలో హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పారు. ఈ పదేళ్లలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు చేశామని, అన్ని రంగాల్లో భారత్ అభివృద్ది పథంలో పయనిస్తోందని వివరించారు.
మూడో అదిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను మారుస్తామని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. అవినీతిరహిత భారత్ నిర్మాణమే బిజెపి లక్ష్యం అంటూ మోదీ పదేళ్లుగా అవినీతిరహిత పాలన అందించారని, కనై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని షా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ అజెండా ఒక్కటే అని, తెలంగాణలో ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. ఆ మూడు అవినీతి పార్టీలే అని చెబుతూ మోదీని ఓడించడమే ఆ పార్టీల ఏకైక లక్ష్యం అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుటుంబ పార్టీలని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలని ఆరోపించారు.
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు ఖాయం అని కేంద్ర హోంమంత్రి తేల్చి చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా. కాంగ్రెస్ అవినీతిపై జవాబు చెప్పాకే బీజేపీపై విమర్శలు చేయాలని చురకలు అంటించారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లి సేద తీరుతారని ఎద్దేవా చేశారు.
గత పదేళ్లలో తెలంగాణకు రూ. 10వేల కోట్లు కేంద్రం సాయం చేసిందని అమిత్ షా చెప్పారు. `పాకిస్తాన్ నుంచి చొరబాట్లను తిప్పికొట్టాం. పాక్పై సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని మోదీ అంతం చేశారు. 2047 నాటికి విశ్వగురువుగా భారత్ అవుతుంది’ అని షా చెప్పుకొచ్చారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం