
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ పరిధిలోని ఐంచోడ కాంబోహ్లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కల్కి ధామ్కు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన వరమని, ఈ ఆలయం భారతీయుల విశ్వాసానికి మరో కేంద్రంగా అవతరిస్తుందని తెలిపారు.
ఇక్కడి ప్రజల 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కల్కి ధామ్కు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని ప్రధాని పేర్కొన్నారు. తన కోసమే కొందరు మంచి పనులు వదిలి వెళ్లారని, భవిష్యత్తులో ఏ మంచి పని మిగిలిపోయినా మహనీయులు, ప్రజల ఆశీస్సులతో వాటిని పూర్తి చేస్తామని చెప్పారు.
అయోధ్యలో బలరాముడు ప్రాణ ప్రతిష్ట జరిగిన జనవరి 22 చరిత్రలో నూతన సకంకు నంది అని చెబుతూ దాని ప్రభావం రాబోయే వేలాది సంవత్సరాలు ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ రోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి అని, ఈ రోజు మరింత పవిత్రమైనదని, ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా మారుతుందని ప్రధాని తెలిపారు.
ఈ రోజు దేశంలో మనం చూస్తున్న సాంస్కృతిక పునర్జీవనం, మన గతం గురించి మనం గర్వించడంకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు దేశంలోని యాత్రా స్థలాలను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ స్థాయిలో నిర్మితం కాబోతున్న ఈ కల్కిధామ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నదని, గర్భాలయంలో దశావతారాలు ఉంటాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ నేడు భారతదేశ వారసత్వ సంపద ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా దేశం ఓ నూతన భారత్ ను చూస్తున్నదని చెబుతూ దేశం ఓ నూతన అభివృద్ధి పథంవైపు పయనిస్తున్నదని తెలిపారు. శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం కూడా పాల్గొన్నారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం