
ఆంధ్రప్రదేశ్లో ఎన్నిల విధుల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించాలని ప్రభుత్వ నిర్ణయం విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను బోధనా విధులకే పరిమితం చేయాలని కొద్ది నెలల క్రితం ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని భావించింది.
ఏపీ ప్రభుత్వ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని విపక్షాలు తప్పుపట్టినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మరోవైపు సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు వంటి డిమాండ్లతో రెండేళ్ల క్రితం ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన జరిపారు. ఆ సమయంలో ఉపాధ్యాయుల ఉద్యమాలను ప్రభుత్వం అణిచివేసింది. దీని ప్రభావం ఎన్నికల్లో ఉంటుందనే అనుమానంతోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఎన్నికల విధులకు వినియోగించడానికి సిద్ధమైనట్లు ఆరోపణలు వచ్చాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు కేంద్ర బృందం ఇటీవల ఏపీలో పర్యటించింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఈసీని కలిసి సచివాలయ సిబ్బందిని ఎన్నికల్లో వినియోగించడంపై అభ్యంతరం తెలిపాయి. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికల విధుల్లో ఎంత మంది ఉద్యోగులు అవసరం అవుతారో అంచనాలు వేసింది.
ఒక్కో పోలింగ్ కేంద్రంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు అవసరం అవుతారని 46 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికల్లో ఉపాధ్యాయులతోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహణ బాధ్యతలను టీచర్లకే అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు