ఇటీవల భారత మండపంలో జరిగిన జీ20 సదస్సులో దేశాధినేతలు రెండు రోజుల పాటు ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రణాళికలు వేశారని, ఇప్పుడు మీరు ఆ వేదికపై కూర్చుని భారత భవిష్యత్తు గురించి చర్చిస్తున్నారని ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. చాలా తెలివైన, కష్టపడే వ్యక్తులను మిత్రులుగా చేసుకోవాలని, అలాంటి స్నేహితులతో ప్రేరణ పొందాలని సూచించారు.
కెరీర్ విషయంలో చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ అప్పుడు ఎటువంటి గందరగోళం ఉండదని చెప్పారు. విద్యార్థులు ఎక్కువగా వత్తిడికి లోను కావొద్దు అని, ఎందుకంటే అది వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని హెచ్చరించారు. అతిగా దేన్ని సాగదీయరాదని, ఏ విధానంలోనైనా క్రమ పద్ధతిలో పురోగతి సాధించాలని విద్యార్థులతో ప్రధాని మోదీ దిశానిర్డశేషం చేశారు.
పేరెంట్స్, టీచర్లు, బంధువులు ఎవరు కూడా విద్యార్థులపై పదేపదే నెగటివ్ పోలికలు చేయకూడదని హితవు చెప్పారు. ఎందుకంటే అది ఆ విద్యార్థి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఆ పోలికల వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని పేర్కొంటూ విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా చాలా సున్నిత విధానంలో సంభాషణలు చేయాలని సూచించారు.
టీచర్లు, విద్యార్థుల మధ్య బంధం ఎలా ఉండాలంటే, ఇది కేవలం సబ్జెక్ట్ సంబంధిత రిలేషన్ మాత్రమే కాదు అని, అంతకన్నా ఎక్కువే అన్న భావన విద్యార్థుల్లో రావాలని మోదీ తెలిపారు. టీచర్లు, స్టూడెంట్ల మధ్య రిలేషన్ చాలా గాఢంగా ఉండాలన్న అభిప్రాయాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. తమలో ఉన్న వత్తిళ్లు, సమస్యలు, అభద్రతా అంశాలను విద్యార్థులు చాలా ధైర్యంగా టీచర్లతో చర్చించే రీతిలో వారి మధ్య రిలేషన్ ఉండాలని చెప్పారు. విద్యార్థుల సమస్యలను విని వాళ్ల బాధలను టీచర్లు తీర్చితే అప్పుడు ఆ విద్యార్థులు చాలా ఎదుగుతారని ప్రధాని తెలిపారు.
ఈసారి పరీక్షా పే చర్చా కార్యక్రమానికి ప్రతి రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులను, ఓ టీచర్ను ఆహ్వానించారు. కలా ఉత్సవ్ విజేతలను కూడా ఆహ్వానించారు. MyGov పోర్టల్ ద్వారా సుమారు 2.26 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్యక్రమం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
More Stories
రాహుల్ బాబాకు దేశాన్ని అప్పగిస్తే అధోగతి పాలే
స్వామి చిన్మయానంద ఓ ఆధ్యాత్మిక విప్లవకారుడు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లైనా రావు