
‘‘జనవరి 22న అయోధ్యకు రావడానికి బదులుగా ఇంట్లో దీపం వెలిగించండి. ఆ రోజు భారతదేశం అంతటా మరోసారి దీపావళి జరగాలి” అని ప్రధాని మోదీ సూచించారు. ఈ మహత్తర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఏళ్ల తరబడి జరుగుతున్నాయని, అందువల్ల ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, భారతదేశంలోని అన్ని దేవాలయాల ప్రాంగణాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాని మోదీ కోరారు. ‘‘శ్రీరాముడు యావత్ దేశానికి చెందినవాడు. ఇప్పుడు ఆయన వస్తున్నారు కాబట్టి చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ దేవాలయమూ మురికిగా ఉండకూడదు’’ అని ప్రధాని మోదీ తెలిపారు.
అయోధ్య నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చాలని నగర ప్రజలను ప్రధాని మోదీ కోరారు. అయోధ్య ధామ్ లో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలని సూచించారు. అయోధ్యలో అన్ని వసతులతో టౌన్ షిప్ లు నిర్మిస్తున్నామని చెబుతూ అయోధ్యలో రద్దీ మేరకు రహదారులు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. అయోధ్యలో 4 కోట్ల మంది నివసించేలా అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు