
అనంతపురం జిల్లాలో కలకలం రేపిన ఐడీబీఐ బ్యాంక్ చోరీ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీ ఇంటి దొంగ పనేనని గుర్తించారు. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏజెంట్ గా పనిచేస్తున్న పోతురాజే చోరీకి పాల్పడ్డిన పోలీసులు నిర్ధారించారు. పోతురాజు తన స్నేహితులతో కలిసి ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షలు చోరీ చేసినట్లు ఎస్పీ అన్భురాజన్ తెలిపారు.
ఏటీఎం ఏజెంట్ గా పనిచేస్తున్న పోతురాజు డబ్బు కాజేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి ప్లాన్ వేసినట్లు విచారణలో తెలిసిందనని చెప్పారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఐడీబీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో నలుగురు నిందితులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 46 లక్షల నగదు చోరీ చేశారు.
క్యాష్ మేనేజ్ మెంట్ సర్వీస్ ఏజెంట్ పోతురాజుపై దాడి చేసి, అతడిని నిర్భందించి నగదు దోచుకెళ్లినట్లు బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ కేసును వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులకు డబ్బు కోసం బ్యాంకు ఉద్యోగి పోతురాజే చోరీ డ్రామా ఆడినట్లు గుర్తించారు. ఐడీబీఐ బ్యాంకు నుంచి డబ్బు తీసుకువస్తున్న సమయంలో దుండగులు తనపై దాడి చేసి డబ్బు దోచుకెళ్లారని పోతురాజు డ్రామా ఆడాడు. పోతురాజు చెప్పిన సమాధానాలపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని విచారించారు.
స్నేహితులతో కలిసి ఏటీఎం ఏజెంట్ పోతురాజు చోరీ డ్రామా ఆడినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 46 లక్షల నగదు, రెండు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. డబ్బుపై ఆశతో పోతురాజు ఈ చోరీకి ప్లాన్ చేశాడని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా