![](https://nijamtoday.com/wp-content/uploads/2023/09/Gadchiroli.jpg)
కుర్ఖెడ సబ్ డివిజన్ పరిధిలోని పోమ్కే బెడ్గావ్ ప్రాంతంలో, బెడ్గావ్ ఘాట్ అటవీ ప్రాంతంలో పోలీసు పార్టీ స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో మందుపాతరను పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు.
ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో డీఎస్ఎండీ పరికరంతో సెర్చ్ చేస్తున్న సమయంలో మందుపాతర బయటపడింది. ఆ తర్వాత అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఆపరేషన్స్) సమాచారం అందించగా బీడీడీఎస్ బృందాన్ని ఘటనా స్థలానికి రప్పించారు. తర్వాత మందుపాతరలో నాలుగు పౌచ్లను గుర్తించారు.
వాటిని ఒకటిన్నర, రెండు అడుగుల లోతులో 11.8 కిలోల భారీ పేలుడు పదార్థాలు పాతిపెట్టారన్నారు. మరో వైపు మావోయిస్టులు అసాంఘిక లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు సూచించారు. హింసామార్గాన్ని ఇప్పటికైనా వీడాలని, లొంగిపోయి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని మావోయిస్టులకు సూచించారు.
More Stories
ఛత్తీస్ గఢ్ లో 8 మంది మావోలు, ఒక జవాను మృతి
భారత సైన్యం అమ్ములపొదిలో నాగాస్త్ర
కాశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతం తప్పనిసరి