ఐదేండ్లుగా చూస్తే ఎక్కువగా పెద్ద పులుల మరణాలున్నాయని, వీటిలో ఎక్కువ శిశు మరణాలున్నట్టు గుర్తించామని పేర్కొంది. దేశంలో వివిధ రాష్ర్టాల్లో మొత్తం 661 పులులు మృతి చెందాయని, వీటిలో సహజ, ఇతర కారణాలతో 516 పులులు మృతి చెంగా, మరో 126 పులులు వేటకు బలయ్యాయని తెలిపింది.
అసహజంగా 19 పులులు మరణించినట్టు వెల్లడించింది. అంటే ప్రతి మూడు రోజులకు ఒక పులి చొప్పున మృతి చెందుతున్నట్లు వివరించింది. 2018లో 53 పులులు మృతి చెందగా, 2019లో 66, 2020లో 90, 2021లో 101, 2022లో 108, 2023లో ఇప్పటి వరకు 98 పులులు చొప్పున మృతి చెందిన్నట్లు వివరించింది.
పులులను వేటాడుతున్న వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటున్నాయని, అరెస్ట్లు చేస్తున్నాయని తెలిపింది. ప్రాజెక్టు టైగర్, టైగర్ రేంజ్ రాష్ర్టాలు పులుల సంరక్షణపై అవగాహన పెంచుతున్నాయని పేర్కొన్నది. ఇందుకోసం రాష్ర్టాలకు నిధులిస్తున్నామని, వన్యప్రాణుల ఆవాసాల సమగ్ర అభివృద్ధికి రాష్ర్టాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
More Stories
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
కాశ్మీర్ లో పోలింగ్కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు
దక్షిణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు