మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అనే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్గాంధీకి ఊరట దక్కలేదు. బెయిల్ ఏప్రిల్ 13 వరకూ పొడిగించింది. అలాగే విచారణను మే 3కు వాయిదా వేసింది. అయితే రాహుల్కు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ సెషన్స్ కోర్ట్ నిరాకరించింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై విచారణను మే 3వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది కోర్టు.
తనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన స్వయంగా సోమవారం సూరత్కు చేరుకున్నారు. 2019లో దాఖలైన పరువు నష్టం కేసులో గత నెల 23న దోషిగా తేలిన ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పు చెప్పింది.
శిక్షను సవాల్ చేసేందుకు పిటిషన్ వేసేందుకు వ్యక్తిగతంగా సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ రావాల్సిన అవసరం ఏముందని అధికార బీజేపీ విమర్శించింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
“సవాల్ చేసేందుకు రాహుల్ గాంధీ సూరత్ కోర్టుకు వెళుతుండవచ్చు. కానీ, అప్పీలు దాఖలు చేసేందుకు దోషి స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ దోషి కూడా వ్యక్తిగతంగా వెళ్లరు. అయితే, నాయకుల బృందం, అనుచరులతో రాహుల్ వ్యక్తిగతంగా వెళుతుండడం అంతా డ్రామా” అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
“కోర్టుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ప్రయత్నం.. పిల్లల చర్యగా కనిపిస్తోంది. దేశంలోని అన్ని కోర్టులు ఇలాంటి వ్యూహాలను అసలు పట్టించుకోవు” అని రిజిజు పేర్కొన్నారు. అయితే, నాయకులతో రాహుల్ గాంధీ వెళుతుండడం బల ప్రదర్శన కాదని కాంగ్రెస్ అంటోంది. ఆయనకు మద్దతుగా నాయకులు వెళుతున్నారని చెబుతోంది.
More Stories
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు కంగనా వీడ్కోలు
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత