లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో అవినీతికి తావులేని పాలన అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. పూర్తి పారదర్శక పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మొత్తం లోకాయుక్త పరిధిలోకి తీసుకువస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. లోకాయుక్త కింద ఐదుగురు రిటైర్డ్ జడ్జిలుంటారని వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టం కూడా ఇందులో భాగంగా ఉంటుందని పేర్కొన్నారు.
అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహజారే నేతృత్వంలోని కమిటీ లోకాయుక్తను ప్రవేశపెట్టే విషయంపై సమర్పించిన నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఫడ్నవీస్ తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకొస్తామని చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఏడాది జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు శివసేన నుంచి విడిపోయి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అంతకు ముందు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్ థాకరే బిజెపితో తెగతెంపులు చేసుకొని, ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి మహావికాస్ అఘాడీని ఏర్పాటు చేసి సంకీర్ణ సర్కారుకు రెండున్నరేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. అయితే ఉద్ధవ్ విధానాలతో విభేదించిన శివసేన ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుబాటు చేసి బీజేపీతో దోస్తీ చేశారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశారు.
More Stories
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లైనా రావు
ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో ముందే హెచ్చరించిన బీజేపీ నేత అరెస్ట్
పాక్ వద్ద అణుబాంబు… గౌరవించాల్సిందే… ఓ కాంగ్రెస్ నేత!