చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోలు మృతి చెందారు. పోమ్రా-హల్లూర్ అటవీ ప్రాంతంలో బీజాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు సహా దాదాపు 40 మంది మావోయిస్టులు జరిపిన సమావేశంపై దాడి జరిపారు. సమావేశమైనట్టు సమాచారం అందుకున్న మిర్తూర్ పోలీసులు ఫై అధికారులకు సమాచారం ఇవ్వగా.. సెంట్రల్ రిజర్వు ఫోర్స్, జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టాయి.
ఈ ఎన్కౌంటర్ శనివారం పొమర్రా- హల్లూరు ఫారెస్ట్ ఏరియాలో జరిగింది. మళ్లీ యాక్టివ్ అవుతున్న మావోయిస్టు దళాలకు పోలీసు బలగాలు కోలుకోలేని దెబ్బ కొట్టాయి.
ఈ క్రమంలో ఇరు వర్గాలు తారస పడడంతో వారి మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోలు మృతి చెందారు.
బలగాలు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. రెండు మృత దేహాలను మావోయిస్టులు తీసుకెళ్లినట్టు బీజాపూర్ పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్లో మరో ముగ్గురు మావోయిస్టులు గాయపడినట్టు తెలిపారు. ఘటన స్థలంలో 303, 315 రైఫిళ్లతో పాటు మూడు ఆయుధాలు, మందుపాతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు మందుపాతరకు సంబంధించిన పేలుడు పదార్ధాలను రికవరీ చేసుకున్నారు. డిసెంబర్ 2వ తేది నుంచి 8వరకు జరిగే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నిర్వాహణపై మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
More Stories
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం