కడప జిల్లా బద్వేల్ కి చెందిన ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో రెండు వేల కిలోమీటర్లకి పైగా పాదయాత్ర చేశాడు. పత్తిపాటి నరసింహ అనే యువకుడు హోటల్ మేనేజర్గా పని చేస్తున్నాడు.. ప్రధాని మోదీని ఆయన పుట్టిన రోజు సందర్భంగా కలవడానికి ప్రయత్నించాడు. కానీ ప్రధాని బిజీగా ఉండటంతో ఆయన్ని కలవడం కుదరక నిరుత్సాహానికి లోనయ్యాడు.
ఎన్ని రోజులు నిరీక్షించైనా సరే ప్రధానిని కలిశాకే తిరిగి వస్తానని చెప్పాడు. మోదీని కలవాలనే ఉద్దేశంతో జులై 17న బద్వేల్ నుంచి కాలినడకన బయలుదేరి, 54 రోజుల పాటు 2015 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సెప్టెంబర్ 8న ఢిల్లీ చేరుకున్నాడు. తాను 500 నుంచి 600 కి.మీ. అడవుల్లో నడిచానని, 40 రోజులు వర్షంలోనే నడిచానని నరసింహ చెప్పాడు.
వేరే పార్టీల వాళ్లు లక్ష రూపాయలు ఇస్తాం వెనక్కి వెళ్లిపోమన్నారని, కానీ ప్రధాని మోడీదీపై తనకున్న అభిమానం వెలకట్టలేనిదని స్పష్టం చేసాడు. సెప్టెంబర్ 17న పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీని కలిసేందుకు నరసింహ అపాయింట్మెంట్ కోరాడు. కానీ ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్ వెళ్లి రావడం, మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లడంతో ఆయన్ను కలవడం సాధ్యం కాలేదు.
ప్రధానిని కలిసేందుకు సెప్టెంబర్ 12నే పీఎంవో అపాయింట్మెంట్ కోరానని, 3-4 రోజుల్లో సమాధానం చెబుతామన్నారని, కానీ ఇంతవరకు సమాధానం రాలేదని నరసింహ చెప్పాడు. తన పాదయాత్ర సమయంలో బీజేపీ కార్యకర్తలు వసతి కల్పించారని తెలిపాడు. తెలంగాణ దాటాక ఆహారం విషయంలో ఇబ్బందులు పడ్డానని తెలిపాడు.
ఒక్కోసారి నిద్రించడానికి రూమ్ కూడా దొరికేది కాదని, దీంతో గుళ్లో, పెట్రోల్ బంకుల్లో నిద్రించేవాడినని చెప్పాడు. తాను బద్వేల్ నుంచి డిల్లీకి వెళ్లడానికి రూ.20 వేల వరకూ ఖర్చయ్యిందన్నాడు. ‘మెదక్ జిల్లా నుంచి ఒకబ్బాయి రెండు రోజులపాటు నాతో వచ్చాడు. చివరి రెండు రోజులు జడ్చర్ల నుంచి కుమార్ అనే అబ్బాయి వచ్చి నాతో చేరాడు. తర్వాత తిరిగి వెళ్లిపోయాడు’ అని నరసింహ వివరించాడు.
తాను ఉండటం కోసం ఢిల్లీకి 23 కిలోమీటర్ల దూరంలో బీజేపీ నాయకులు ఒక రూం ఇచ్చారని చెబుతూ ఎన్నిరోజులైనా ఫర్వాలేదని, ప్రధానిని కలిసే వస్తానని భరోసా వ్యక్తం చేస్తున్నాడు. “ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. అలాంటి ప్రధాని ఇప్పటి వరకూ మనకు రాలేదు.. భవిష్యత్తులోనూ వస్తారనే నమ్మకం లేదు. ఆయన దేశాన్ని అభివృద్ధి పథంలోనే నడిపేలా పని చేస్తున్నారు” అంటూ ప్రధాని పట్ల తన అచంచల విశ్వాసాన్ని వ్యక్త పరిచాడు.
“అయోధ్య రామాలయం నిర్మాణం కోసం ప్రధాని చొరవ తీసుకున్నారు. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేశారు. దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ట్రిపుల్ తలాఖ్ను రద్దు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడటానికి కృషి చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు” అంటూ వివరించాడు.
More Stories
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలపై సిబిఐ దర్యాప్తు
కాంగ్రెస్ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం.. అందుకే 400 సీట్లు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఈసీ ఆదేశాలు ఇవ్వలేదు