మహిళా క్రికెట్‌ జట్టుకెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

మహిళా క్రికెట్‌ జట్టుకెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
ఈ నెలలో శ్రీలంకలో పర్యటించే భారత మహిళా క్రికెట్‌ జట్టును బిసిసిఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా మాజీ సారధి మిథాలీ రాజ్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించడంతో.. ఆమె స్థానంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను కెప్టెన్‌గా బిసిసిఐ నియమించింది.
 
ఇప్పటికే టీ20 జట్టుకు హర్మాన్‌ప్రీత్ కౌర్ ఇప్పటికే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా ఇకపై వన్డేల్లోనూ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనుంది. కాగా శ్రీలంక పర్యటనలో భారత మహిళా క్రికెట్ జట్టు 3 టీ20 మ్యాచులు, 2 వన్డేలు ఆడనుంది. 
అయితే బిసిసిఐ ప్రకటించిన జట్టులో వెటరన్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామికి చోటు దక్కకపోవడం గమనార్హం. రోడ్రిగ్స్‌, రాధా యాదవ్‌కు టి20ల్లో, హర్లిన్‌, తానియా భాటియాకు వన్డేల్లో మాత్రమే చోటు దక్కాయి. మిగతా సభ్యులందరూ టి20, వన్డేలో చోటు దక్కించుకున్నారు.
వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్‌(కెప్టెన్‌), మంధాన, షెఫాలీ, యాస్తికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, సిమ్రన్‌ బహదూర్‌, రిచా ఘోష్‌, వస్త్రాకర్‌, మేఘనా సింగ్‌, రేణుకా సింగ్‌, తానియా భాటియా, హర్లీన్‌ డియోల్‌.
టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్‌(కెప్టెన్‌), మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, సిమ్రన్‌ బహదూర్‌, రిచా ఘోష్‌, పూజా వస్త్రాకర్‌, మేఘనా సింగ్‌, రేణుకా సింగ్‌, జెమీమా రోడ్రిగెజ్‌, రాధా యాదవ్‌