ట్రెజరీ బిల్లుల జారీకి ఆమోదించిన పరిమితిని 3000 బిలియన్ల నుండి 4000 బిలియన్లకు పెంచే ప్రతిపాదనను పార్లమెంటుకు సమర్పించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
“నవంబర్ 2019లో, మన విదేశీ మారక నిల్వలు 7.5 బిలియన్ల అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయి. అయితే, నేడు, 1 మిలియన్ మాత్రమే ఉండడం ఖజానాకు సవాలుగా ఉంది. గ్యాస్ దిగుమతికి అవసరమైన 5 మిలియన్లను సేకరించడం ఆర్థిక మంత్రిత్వ శాఖకు కష్టంగా ఉంది. ” అని పిఎం విక్రమసింఘే తెలిపారు.
“ప్రస్తుతం మన వద్ద కేవలం ఒక రోజు మాత్రమే పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. అయితే, ఆదివారం వచ్చిన డీజిల్ రవాణా కారణంగా డీజిల్ కొరత కొంత వరకు తగ్గుతుంది,” అని ఆయన పేర్కొన్నారు. భారత క్రెడిట్ లైన్ కింద మే 18 , జూన్ 1 తేదీల్లో రెండు అదనపు ఇంధన కార్గోలు రానున్నాయని శ్రీలంక ప్రధాని వివరించారు.
దేశంలో విద్యుత్ సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ, చమురు ద్వారా నాలుగో వంతు విద్యుత్ ఉత్పత్తి అవుతున్నందున, రోజువారీ విద్యుత్తు అంతరాయాలు రోజుకు 15 గంటలకు పెరిగే అవకాశం ఉందని ప్రధాని హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని కొంత వరకు నివారించేందుకు తాము ఇప్పటికే డబ్బు సమకూర్చుకున్నామని చెప్పారు.
వినియోగదారులకు గ్యాస్ అందించడానికి వెంటనే 20 మిలియన్ల డాలర్లను పొందాలని ఆయన పేర్కొన్నారు. ఇంధనం కోసం చెల్లించడానికి ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుండి డాలర్లను సేకరించడానికి ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
ఔషధాల తీవ్ర కొరత గురించి ప్రస్తావిస్తూ, నాలుగు నెలల పాటు మందులు, వైద్య పరికరాలు, రోగులకు ఆహారం సరఫరా చేసేవారికి 34 బిలియన్ల శ్రీలంక రూపాయల చెల్లింపులు బకాయిపడ్డాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇంతలో, ఈ కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వం పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియలో ఉందని ఆయన చెప్పారు.
తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న శ్రీలంక ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరించాలని విక్రమసింఘే ప్రతిపాదించారు. “2020-2021లో మాత్రమే 45 బిలియన్ల శ్రీలంక రూపాయల నష్టం. 31 మార్చి 2021 నాటికి, మొత్తం నష్టం 372 బిలియన్లకు చేరుకుంది. మనం శ్రీలంక ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరించినప్పటికీ, ఇది మనం భరించాల్సిన నష్టమే” అని ఆయన స్పష్టం చేశారు.
More Stories
బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు
కొవిషీల్డ్తో ప్రమాదకరమైన దుష్ప్రభావాలు
ప్రైవేటు వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్ వేయడమా?