
బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్కు హైకోర్టు నోటీసులిచ్చింది. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. సాయిగణేష్ మృతికి మంత్రి, జిల్లా పోలీసులే కారణమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాయిగణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. ఈ ఘటనలో 8 మందిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు.
అయితే సాయి గణేశ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ ధర్మాసనానికి విన్నవించారు. దీంతో న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
తొలుత, సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ను న్యాయస్థానం స్వీకరించింది. సాయి గణేష్ మృతికి స్థానిక మంత్రి, జిల్లా పోలీసులు కారణమని పిటిషన్లో పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలంటే సీబీఐ ద్వారా విచారణ అవసరమని న్యాయవాదులు కోర్టుకు చెప్పారు.
ప్రతి వాదులుగా సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్, తెలంగాణ హోం ప్రిన్సిపాల్ సెక్రెటరీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం, ఎస్హెచ్ఓ టూ టౌన్ ఖమ్మం ఉన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కార్పొరేటర్ భర్త ప్రసన్నకృష్ణ కలిసి సాయిగణేష్పై పలు కేసుల పెట్టించి.. పదేపదే స్టేషనకు పిలిపించి వేధింపులకు గురిచేశారని, అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు చెబుతున్నారు. సాయిగణేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెల 14న ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు సాయి గణేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బీజేపీ కార్యకర్తలు వెంటనే ఆయనను హాస్పిటల్ లో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణానికి ముందు మీడియాతో మాట్లాడిన సాయి గణేశ్ తనను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు గురి చేసినట్లు చెప్పారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు తనపై 16 కేసులు పెట్టడంతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేశారని చెప్పాడు.
More Stories
ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేత పంపిణీపై బిజెపి ఫిర్యాదు
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు