దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. ఈ రంగంలో భారత్ వాటాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. టాయ్ కథాన్-2021 వర్చువల్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ దేశం కోట్లాది రూపాయల విలువైన 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చడం ముఖ్యమని సూచించారు.
ప్రపంచ బొమ్మల మార్కెట్లో సుమారు వంద బిలియన్ డాలర్ల వాటా కాగా, భారత్ వాటా 1.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉందని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా బొమ్మల ప్రాముఖ్యతను తెలిపారు. ‘పిల్లల మొదటి పాఠశాల కుటుంబమైతే.. తొలి పుస్తకం, మొదటి నేస్తాలు బొమ్మలు’ అని చెప్పుకొచ్చారు.
దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమలకు ఊతమ్వివాలని, ప్రపంచ స్థాయి మార్కెట్ను సృష్టించేందుకు కృషిచేయాలని ప్రధాని సూచించారు. ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్ ఉంద ఉందని స్పష్టం చేశారు.
కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సైతం హాజరయ్యారు. టాయ్కాథన్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, డీపీఐఐటీ, వస్త్ర మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఏఐసీటీఈలు సంయుక్తంగా నిర్వహించాయి.
భారతదేశం అంతటా సుమారు 1.2 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాలగోని, 17,000 ఆలోచనలను నమోదు చేసి సమర్పించారు. వీటిలో జూన్ 22-24 వరకు జరుగుతున్న మూడు రోజుల టాయ్కాథన్ గ్రాండ్ ఫైనల్కు 1,567 ఆలోచనలు ఎంపిక చేయసారు.
కొన్ని ఆలోచనలలో టీం ఐకాగ్నిటో ఆరా ఉన్నాయి. ఇది విఆర్, ఎఆర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పురాతన యోగా కళను గేమిఫై చేస్తుంది. మరొక బృందం, హెరిటేజ్ రేస్, ఒక ఆటను ప్రదర్శించింది. ఇందులో పాల్గొనేవారు ఇంట్లో స్థిరమైన సైక్లింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు తాజ్ మహల్ వంటి వారసత్వ మార్గాల ద్వారా చక్రం తిప్పగల వర్చువల్ వాతావరణాన్ని సృష్టించారు.
హైదరాబాద్ లోని మియాపూర్ లో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అన్ని వయసుల విద్యార్థులకు, దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఆధునిక, వేద గణిత భావనలను మిళితం చేసే బోర్డువామ్ క్రీడావియుతో ముందుకు వచ్చారు.
More Stories
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు
బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు ప్రశంసలు