
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు లాక్ డౌన్ ను పొడగించింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అంటే గంట పాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది.
సాయంత్రం 6 గంటలనుంచి తిరిగి తెల్లారి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలే యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో ఎక్కువ కేసులున్నాయని అధికారులు రిపోర్టు ఇవ్వడంతో మధ్యాహ్నం వరకే లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
కాగా, తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 లక్షల 46 వేల 169 రేషన్ కార్డులను కూడా మంజూరు చేయాలని మంత్రులు నిర్ణయించారు. తెలంగాణలో 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఈ సబ్ కమిటీ పని చేయనుంది. కమిటీలో సభ్యులుగా హరీష్రావు, తలసాని, సబిత, ఇంద్రకరణ్రెడ్డి ఉండనున్నారు. హైదరాబాద్ మినహా పాత 9 జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు.
More Stories
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం