దేవరయాంజల్ భూముల దర్యాప్తుపై ఇపుడు తొందరెందుకని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల పరిధిలోని దేవరయాంజల్ భూముల ఆక్రమణలపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది.
ఈ నెల 3న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1014ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ సందర్బంగా .. ఎప్పటి నుంచో ఉన్న వివాదంపై ఇప్పుడే తొందర ఎందుకని ప్రశ్నించింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన ఈ అంశంపై ఎందుకని నిలదీసింది.
కరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్లతో విచారణ జరపాలా?అని అడిగింది. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగిలిన ఆలయాల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేశామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కమిటీ నివేదిక ఇచ్చాకే చట్టప్రకారమే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పుడే కూల్చివేతలు వంటి చర్యలు ఉండవన్న అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన కోర్టు .. ప్రాథమిక విచారణకైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇవ్వాలని కమిటీకి ఆదేశమిచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు కమిటీ విచారణకు సహకరించాలని సూచించింది.
వారి వివరణ తీసుకున్నాకే నివేదక ఇవ్వాలని చెప్పింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు