దక్షిణా కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు- ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రావాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
పుల్వామాలోని ఘాట్ మొహళ్లా కాకపోరా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.
తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వారికీ ధీటుగా భారత సైన్యం ఎదురుదాడి చేసింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఇద్దరు తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పుల్వామా జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

More Stories
యాసిడ్ దాడి నిందితులపై సానుభూతి చూపరాదు
ఢిల్లీలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు
పుతిన్ రాకతో 5 నుంచి ఆర్టీ ఇండియా టీవీ ప్రసారాలు