కేవలం రెండు నెలల కోసం మొత్తమ్ ఏడాది ఫీజు వసూలు చేస్తుంటే విద్యా శాఖ అధికారులు కళ్ళు మూసుకుని కూర్చున్నారా అని సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కార్పొరేట్ విద్య సంస్థల వెనుక టీఆరెస్ పెద్దలు ఉన్నందువల్లనే ఇంటర్ బోర్డు మౌనం వహిస్తుందోదని ఆరోపించారు.
గతం లో లాగా ఇంటర్ విద్యార్థులకు ఏమైనా నష్టం వాటిల్లితే ప్రభుత్వ పెద్దల్ని ఎవరిని వదలం అని హెచ్చరించారు.
లెక్చరర్లు, టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని మరో సారి సంజయ్ డిమాండ్ చేశారు. సిబ్బందితో యాజమాన్యాలు వెంటనే మీటింగ్ పెట్టుకుని జీతాల సమస్య పరిష్కరించాలని సూచించారు. మేధావులు, విద్యావంతులైన సిబ్బంది కి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఉసురు పోసుకోవద్దని హితవు చెప్పారు.
ఫీజుల విషయం లో, సిబ్బంది వేతనాల చెల్లింపు విషయం లో అధికారులు మౌనం వహించడం వెనుక ఎవరి ప్రయోజనం దాగుందో తమకు తెలుసని సంజయ్ ధ్వజమెత్తారు. సందర్భం వచ్చినప్పుడు కాలేజీల చరిత్ర, టీఆరెస్ నేతల బండారం బయట పెడతామని హెచ్చరించారు.
More Stories
వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే