మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆమెను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. కోర్టు సెలవు కారణంగా న్యాయమూర్తి నివాసంలో అఖిలప్రియను హాజరుపర్చారు.
మూడు రోజుల విచారణ స్టేట్మెంట్ను న్యాయమూర్తికి పోలీసులు అందజేశారు. దీంతో అఖిలప్రియకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాదులు కోరారు.
కాగా పోలీస్ కస్టడీలో భాగంగా బేగంపేట మహిళా పీఎస్లో 3 రోజులు అఖిలప్రియను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ఆమెకు బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్గా తేలింది.
అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, గైనకాలజి డిపార్ట్మెంట్లో పరీక్షలు నిర్వహించారు. న్యూరాలజీ వైద్యులు పరీక్షలు జరిపారు.
ఇలా ఉండగా, బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అఖిలప్రాయ సోదరుడు జగత్ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఫైనల్ దశకు చేరింది. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు.
జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ఈ కేసులో జగత్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
More Stories
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం