ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ వేడుకలు జరుగుతున్నాయి. కాశీ నుండి వద్నగర్ వరకు, ప్రజలు ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు కోసం ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి నగరంలోనూ ఆశీర్వాద దీపాలను వెలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో, పవిత్ర నగరమైన, ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కాశీలో ఉన్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. వీరంతా కలిసి పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు, శ్రేయస్సు కోసం 11 హవన కుండల వద్ద ప్రార్థనలు జరిగాయి. పూజారులు ప్రత్యేక మంత్రాలను పఠించారు. బాబా విశ్వనాథునికి మహారుద్రాభిషేకం కూడా నిర్వహించారు.
అనంతరం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాశీ నుండి వద్నగర్కు బైక్ ర్యాలీని ప్రారంభించారు. వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీని చూసి దేశం గర్వపడుతోందని, దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారన్నారంటూ ప్రశంసించారు. ప్రధాని మోదీ సంస్కరణలతో 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ దేశ ప్రజలంతా జాతి నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వద్నగర్ నుండి కాశీకి బైక్ ర్యాలీ
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా, గుజరాత్లోని వద్నగర్ నుండి కాశీకి కూడా ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పాల్గొన్నారు. వద్నగర్లో, నాయకులందరూ ముందుగా ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో వరుస విజయాలు నమోదయ్యాయని అమిత్ షా వద్నగర్లో పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో ప్రధాని మోదీ ఒక్క ఎన్నికలో కూడా ఓడిపోలేదని ఆయన గుర్తు చేశారు. “ప్రధాని మోదీ ఎల్లప్పుడూ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు, అలాగే బీజేపీ ఇప్పుడు బెంగాల్లోని బలమైన కోటను కూడా జయించింది” అని ఆయన తెలిపారు.
ఢిల్లీలో 1.25 లక్షల దీపాలు
చారిత్రాత్మక ‘సేవా సంకల్ప్’ బైక్ యాత్ర వద్నగర్ నుండి వారణాసికి బయలుదేరడం విశేషం. ఈ యాత్ర 10 వేర్వేరు బృందాలుగా వద్నగర్ నుండి బయలుదేరింది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కర్తవ్య పథ్పై 1.25 లక్షలకు పైగా దీపాలను వెలిగించనున్నారు. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ప్రజలు తమ ఇళ్లలో ‘ఆశీర్వాద దీపం’ వెలిగించాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజ్ఞప్తి చేశారు.
అలీపూర్లోని ఖాటుశ్యామ్ ఆలయంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ‘100 కుండి హవనం’ నిర్వహించి, ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించారు. దీనితో పాటు, ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ఈ రోజు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఈ రోజు రక్తదానం చేశారు.
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ రక్తదానం
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రక్తదానం చేశారు. ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన అనంతరం, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వచ్చిందని బీజేపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ సంకల్ప అభియాన్లో ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు మరియు దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

More Stories
స్వతంత్ర భారత చరిత్రలో హైదరాబాద్ సంస్థానం విమోచన ఓ కీలక ఘట్టం
సలియాన్ మృతి కేసులో ఆదిత్య థాకరేకు రూ. 500 కోట్ల నోటీసు
రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం