కోల్‌క‌తాలోకుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గిడ్డంగి

కోల్‌క‌తాలోకుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గిడ్డంగి
కోల్‌క‌తాలోని తారాత‌లా ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో నిర్మాణంలో ఉన్న మూడంత‌స్తుల గోదాం కుప్ప‌పోవడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. శిథిలాల కింద మ‌రో ఇంకా పలువురు చిక్కుతున్నట్లు భావిస్తున్నారు. గోదాం నిర్మాణంలో భారీ ఇనుప స్తంభాలు వాడ‌టంతో స‌హాయ‌క చ‌ర్య‌లు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు. 

అంత‌కుముందు ప్ర‌మాదం జ‌ర‌గ‌గానే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దాంతో పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది క‌లిసి హుటాహుటిన ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో గోడౌన్‌లో పెద్ద సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పైకప్పు కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకోగా, వారిలో కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సహాయక చర్యలు జరుగుతున్న ప్రమాద స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, శిథిలాల కింద మరో 18 మంది వరకు చిక్కుకుని ఉన్నారని తెలిపారు. అక్కడ సైన్యంతో సహా రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. కూలిపోయిన గిడ్డంగి నగరంలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ పరిధిలో లీజుకు ఇవ్వబడిన ఆస్తి అని ఒక అధికారి తెలిపారు. 

“ఇప్పటివరకు 21 మందిని రక్షించారు. వారిలో ముగ్గురు మరణించారు. మిగిలిన వారిని ఎస్ఎస్ కెఎం ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ వారికి తగిన వైద్య చికిత్స అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ముఖ్యమంత్రి అంతకుముందు పేర్కొన్నారు. ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగింది.  చివరిగా అందిన సమాచారం ప్రకారం, రక్షించిన వారందరినీ (వీరు నిర్మాణ స్థలంలో పనిచేసే కార్మికులుగా భావిస్తున్నారు) ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్ కేఎం ఆసుపత్రిలోని ట్రామా కేర్ సెంటర్‌లో చేర్చారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.