పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారి సాధించిన చారిత్రాత్మక విజయంతో పాటు, అసోంలో వరుసగా మూడోసారి, పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పడటం పట్ల సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ప్రతి ఫలితాన్ని సభికులు ఘన చప్పట్లతో స్వాగతించారు. భారత పార్లమెంట్ సభ్యులు మయాంక్ నాయక్ జూమ్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నాయకత్వంలో బీజేపీ ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేసి ఈ విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు.
ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షులు డా. అడపా ప్రసాద్ మాట్లాడుతూ, “భారత భద్రత మరియు సమగ్రత దృష్ట్యా బెంగాల్, అసోం విజయాలు ఎంతో కీలకం” అని తెలిపారు. భారతీయ జనసంఘ స్థాపకుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 75వ వార్షికోత్సవ సంవత్సరంలో బెంగాల్లో బీజేపీ విజయం సాధించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే కేరళలో కూడా బీజేపీ ఓట్ల శాతం మరియు స్థానాల్లో మంచి పురోగతి సాధించిందని చెబుతూ వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సభలో పలువురు వక్తలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ లనాయకత్వాన్ని ప్రశంసించారు. పార్టీ బలోపేతానికి వారి వ్యూహాత్మక నాయకత్వం, క్షేత్రస్థాయి నిర్వహణ ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ కమ్యూనిటీ నాయకులు కృష్ణారెడ్డి అనుగుల, జయేష్ పటేల్, చరణ్ సింగ్, ఆల్బర్ట్ జసాని, హెచ్.ఆర్. షా, డా. సుధీర్ పారిఖ్, పీయూష్ పటేల్, శ్రీమతి కల్పనా శుక్లా, శ్రీమతి దీప్తి జాని, ప్రదీప్ కట్ట, శ్రీమతి సుమా రెడ్డి, విలాస్ జంబుల,అరవింద్ పటేల్, అమిత్ పాండే, ఆనంద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విందులో పశ్చిమ బెంగాల్ విజయాన్ని పురస్కరించుకొని బెంగాలీ ప్రత్యేక వంటకం “జాల్మురి”ని వడ్డించారు.

More Stories
భారత్లో తొలిసారి పట్టుబడిన ‘జీహాదీ’ డ్రగ్
సింధూ జలాలపై ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు చెల్లదన్న భారత్
ఒలింపిక్స్, తయారీ కేంద్రం, గ్రీన్ హబ్, ప్రపంచ ఆర్థిక శక్తి!