కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మిశ్రమంగా కౌంటింగ్ సిబ్బంది ఉంటారని తమ సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నట్లు ఈసీ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. రిటర్నింగ్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉంటారని, కౌంటింగ్ సిబ్బందిని నియమించే అధికారం ఆయనకు ఉంటుందని తెలిపింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతాయన్న టీఎంసీ ఆందోళనలు నిరాధారమని వాదించింది.
ఆ సర్క్యులర్ను తూచా తప్పకుండా అమలుచేస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. టీఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ ఆ సర్క్యులర్ ఏప్రిల్ 13 నాటిదని, అయితే, దాని గురించి తమకు ఏప్రిల్ 29న తెలిసిందని తెలిపారు. ఆ సర్క్యులర్లో ఉన్నదిఉన్నట్లుగా అమలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దాంతో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ స్పందిస్తూ ఆ సర్క్యులర్ అమలు కావాలని ఆశిస్తున్నట్లయితే అసలు కోర్టు ముందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
టీఎంసీ పిటిషన్ను తోసిపుచ్చుతూ దీనిపై తదుపరి ఆదేశాలు అక్కర్లేదని చెప్పారు. ఎన్నికల సంఘం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా లేదని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా, ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది డీ.ఎస్. నాయుడు, రిటర్నింగ్ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అని, ప్రభుత్వ ఉద్యోగులను ఏ విభాగం నుంచైనా సిబ్బందిని నియమించే అధికారం ఆయనకు ఉంటుందని తెలిపారు.
ఓట్ల లెక్కింపు సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని చెప్పారు. ప్రతి అభ్యర్థికి వారి స్వంత కౌంటింగ్ ఏజెంట్ కూడా ఉంటారని తెలిపారు. అలాగే, టీఎంసీ ఆందోళనలు నిరాధారమైనవని పేర్కొన్నారు. మరోవైపు, మమతా దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చడం మమతా బెనర్జీకి న్యాయపరమైన ఎదురుదెబ్బ అని బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ మాల్వీయా పేర్కొన్నారు.

More Stories
బెంగాల్ ఫాల్టాలో ఉద్రిక్తత.. టీఎంసీ గూండాల బెదిరింపులు
అలర్ట్ సిస్టమ్ తో దేశవ్యాప్తంగా మోగిన మొబైల్ ఫోన్లు!
బీజేపీలో చేరిన సందీప్ పాఠక్పై పంజాబ్ లో రెండు కేసులు