ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఘటన అనంతరం ఆలయంలో పూజలు, దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు.
మరోవైపు ఈ ప్రమాదంపై ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని చెప్పారు. గాయపడిన వారికి సరైన చికిత్స కోసం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై బిహార్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించడంతో పాటు, ఆలయంలో సాధారణ పరిస్థితులు త్వరగా పునరుద్ధరించాలని సూచించింది. ఘటన తీవ్రత దృష్ట్యా ఆలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఆలయం వద్ద 25,000 మందికి పైగా జనసమూహం గుమిగూడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా తన కుటుంబం కోసం కేకలు వేయడంతో అక్కడ గందరగోళం నెలకొని తొక్కిసలాట జరిగిందని అంటున్నారు.

More Stories
2.37 లక్షలకు పైగా ఓటర్లకు ఇంటి వద్దే ఓటు సౌకర్యం
ఖరీదైన టెక్నాలజీని కారు చౌకగా బదిలీ చేస్తున్న ఇస్రో
శ్రీ లంకకు 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనం పంపిన భారత్