ప్రతిరోజూ ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుండి ఆఫీసుకి వెళ్లే ఆటో వరకు మనల్ని వేధించే ప్రధాన సమస్య ‘చిల్లర’. జేబులో రూ. 500 నోటు ఉన్నా పది రూపాయల టీ తాగడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశాయి. అదే ‘హైబ్రిడ్ ఏటీఎం’.
మన దేశంలో యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ. ఇప్పటికీ చిన్న చిన్న అవసరాలకు నగదు ప్రాధాన్యత తగ్గలేదు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు, బస్సు ప్రయాణాలు, చిన్నపాటి చిరుతిళ్ల దగ్గర రూ. 500 నోటు ఇస్తే ‘చిల్లర లేదు’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సరికొత్త హైబ్రిడ్ లను ప్రవేశపెడుతోంది.
ఈ మిషన్లు కేవలం డబ్బులు డ్రా చేయడానికే కాదు, మీ దగ్గర ఉన్న పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. సాధారణ ఏటీఎంలు ఎక్కువగా రూ. 500, రూ.200 వంటి నోట్లనే స్టాక్ చేస్తాయి. కానీ, ఈ కొత్త హైబ్రిడ్ మిషన్లు రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లను అందించేందుకు చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
వీటిలో ప్రధానంగా రెండు ఫీచర్లు ఉంటాయి: మైక్రో విత్డ్రాల్స్: రోజువారీ అవసరాల కోసం చిన్న మొత్తంలో నగదును తీసుకోవచ్చు. నోట్ ఎక్స్ఛేంజ్: మీ వద్ద ఉన్న రూ. 500 నోటును మిషన్లో ఉంచితే అది వెంటనే మీకు అవసరమైన చిన్న నోట్లను అందిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఇప్పటికే ముంబైలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు.
రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ప్రభుత్వ ఆసుపత్రులు, రద్దీగా ఉండే మార్కెట్లను దీని కోసం ఎంపిక చేశారు. ముంబైలో ఈ ప్రయోగం విజయవంతమైతే మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా వీటిని విస్తరించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికీ 60% పైగా లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నందున ఈ నిర్ణయం అక్కడి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.

More Stories
శబరిమల బంగారం దోపిడీ కేసులో నటుడు జయరామ్ వాంగ్మూలం
భారత్- ఈయూ ఒప్పందంపై అప్పట్లో అడ్డంకిగా జైరాం రమేష్!
గరిష్ట స్థాయికి చేరి ఒకేసారి పడిపోయిన బంగారం, వెండి ధరలు