సంఘటనా స్థలానికి రెస్క్యూ, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని మోహరించాయి. రద్దీ సమయంలో ఈ ఘటన జరగడంతో భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో న్యాయవాదులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో ఆ శబ్దం దాదాపు ఆరు కిలోమీటర్ల పరిధి వరకూ వినిపించినట్లు స్థానిక మీడియా నివేదించింది. గాయపడిన వారిలో ఎక్కువ మంది లాయర్లు, కోర్టు సిబ్బందిగా పేర్కొంది.
కాగా, దక్షిణ వజీరిస్థాన్ లోని కాడెట్ కాలేజ్ వానా వద్ద తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ దాడిని పాక్ భద్రతా దళాలు భగ్నం చేశాయి. కళాశాల విద్యార్థులను బందీలుగా చేసుకోవాలన్న టీటీపీ ప్రయత్నాన్ని పాక్ బలగాలు అడ్డుకున్నాయి. టీటీపీ ప్రయత్నాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో బ్లాస్ట్ జరగడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
వియత్నాంలో మునిగిన భారత పర్యాటకుల బోటు.. 32 మంది గల్లంతు
భారత్- న్యూజిలాండ్ ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు
భారత్కు ముప్పుగా బ్రహ్మపుత్రపై చైనా బారీ జల విద్యుత్ ప్రాజెక్టు