ఆనంద్ విహార్లో ఏక్యూఐ 379గా నమోదైంది. ఐటీవో ప్రాంతంలో 376, ఛాందినీ చౌక్ ప్రాంతంలో 360, ఓఖ్లా ఫేజ్-2లో 348, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద 316, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (టెర్మినల్-3) వద్ద 305, నోయిడా సెక్టార్ 62వద్ద 342, సెక్టార్-1లో 325, సెక్టార్ 116 ప్రాంతంలో 339, గురుగ్రామ్ సెక్టార్ 51 వద్ద 327గా ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి.ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు దిగజారుతుండటంతో రాజధాని వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఆప్, కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు ఢిల్లీ వాసులు ఇండియా గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జీవించే హక్కు తమకు ఉన్నదని నినాదాలు చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఇండియా గేట్ వద్ద ఎలాంటి నిరసనలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. కేవలం జంతర్ మంతర్ వద్ద మాత్రమే నిరసనలు చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల చర్యపై ఢిల్లీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
బెంగుళూరు విమానాశ్రయంలో నమాజ్
భారత్ లో ఉగ్రవాదం వెనుక పాక్ ఐఎస్ఐ సీక్రెట్ యూనిట్ ‘ఎస్1’
బీహార్ లో రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు!