100 రోజుల్లో 6 గ్యారంటీలు” అని అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తగిన అభ్యర్థులు లేరని, అందుకనే గతంలో ఎంఐఎం నుంచి పోటీచేసిన అభ్యర్థిని ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తోందని ఎద్దేవా చేశారు.
ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లలో బైండోవర్ అయ్యే కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? లేక ప్రజల మధ్య తిరిగే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పనిచేసే బిజెపి అభ్యర్థి కావాలా? అని తెలిపారు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలే తగిన నిర్ణయం తీసుకుంటారని రామచందర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు పార్టీని మరింత బలోపేతం చేసేలా, పార్టీ విస్తరణ కోసం సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసి విస్తరించడం ఇక్కడి నాయకులు, కార్యకర్తలపై జాతీయ పార్టీ బలమైన నమ్మకాన్ని ఉంచిందని ఆయన తెలిపారు. బిజెపి జాతీయ పార్టీ సూచనల మేరకు ప్రతిఒక్కరు సమన్వయంతో పార్టీని ముందుగా తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

More Stories
జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్
తెలంగాణపై మొంథా పంజా.. జలదిగ్బంధంలో వరంగల్
హిందూ మహిళపై అత్యాచారం… అబ్దుల్ లతీఫ్ కు పదేళ్లు జైలు