దేశ వ్యతిరేక కార్యకలాపాలతో దశాబ్దాలుగా భద్రతా వ్యవస్థకు సవాల్గా నిలుస్తున్న మావోయిస్టు ఉద్యమంలో కీలక మలుపు రానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్జియే)–1 కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగుచూసింది.
చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన ఈ మావోయిస్టు నాయకుడు, సుమారు 200 మంది మావోయిస్టు సభ్యులతో కలిసి లొంగుబాటు అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నాడనే ప్రచారం కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు కట్టుదిట్టమైన ఆపరేషన్లు చేపట్టడం, నాయకత్వం మార్పులు, అంతర్గత విభేదాలు వంటి అంశాల ప్రభావంతో హిడ్మా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. సుక్మా అడవుల్లోని మావో స్కూళ్లో శిక్షణ పొందిన ఆయన, క్రమంగా ఆర్గనైజేషన్లో ప్రాధాన్యత పొందాడు. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర మావోయిస్టు నేతలతో కలిసి పనిచేసి అనేక దాడులకు వ్యూహరచన చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 2010లో దంతేవాడ అంబుష్, 2013లో జిరంఘాటీ దాడి, 2021లో సుక్మా-బీజాపూర్ ఎన్కౌంటర్ వంటి అనేక దాడుల వెనుక హిడ్మా కీలక పాత్ర వహించినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. మావోయిస్టు సైనిక విభాగంలో వ్యూహాత్మక ఆలోచనల్లో దిట్టగా ఉండే ఆయన, గిరిజన ప్రాంతాల్లో తన నెట్వర్క్ను బలపరచాడు.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!