
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అమెరికన్ చిప్ తయారీ సంస్థ క్వాల్కమ్ అధ్యక్షుడు, సీఈఓ క్రిస్టియానో ఆర్ అమోన్తో భేటీ అయ్యారు. కృత్రిమ మేధస్సు, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి మొదలైన అంశాల్లో భారత్ సాధించిన పురోగతి గురించి ఆయనతో చర్చించారు. భారతదేశ సెమీకండక్టర్, ఏఐ మిషన్ల పట్ల క్వాల్కమ్ చూపిస్తున్న నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశంసించారు.
సమిష్టి భవిష్యత్ కోసం రూపొందించే టెక్నాలజీని బిల్డ్ చేయడానికి, భారతదేశం సాటిలేని ప్రతిభానైపుణ్యాలను, స్థాయిలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్వాల్కమ్ సీఈఓతో సమావేశం అద్భుతంగా జరిగిందని పేర్కొంటూ ఎక్స్లో మోదీ ఓ పోస్టు పెట్టారు. భారత ఏఐ, సెమీకండక్టర్ మిషన్లతోపాటు, 6జీకి మద్దతుగా భారత్-క్వాల్కమ్ మధ్య విస్తృత భాగస్వామాన్ని పెంపొందించడంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు క్వాల్కమ్ సీఈఓ పేర్కొన్నారు.
“మోదీకి కృతజ్ఞతలు. ఆయనతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఏఐ స్మార్ట్ఫోన్స్, కంప్యూటర్లు, స్మార్ట్గ్లాసెస్, ఆటో, ఇండస్ట్రియల్ ఇలా పలు రంగాల్లో భారత్ ఎకో సిస్టమ్ మమ్మల్ని మరింత ప్రోత్సహించాయి” అని క్వాల్కమ్ సీఈఓ ఆర్.అమోన్ పేర్కొన్నారు.
ఈ వారం ప్రారంభంలో ప్రధాని మోదీ, అమెరికన్ థింక్ ట్యాంక్ హడ్సన్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాల్టర్ రస్సెల్ మీడ్ నేతృత్వంలోని పలువురు థింకర్స్తో, వ్యాపారవేత్తలతో మాట్లాడారు. ఈ సందర్బంగా “భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో, ప్రపంచ శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం మా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి సహకరం చాలా విలువైనదిగా భావిస్తున్నానని” మోదీ తెలిపారు.
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!